PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బీసీ జనార్దన్ రెడ్డికి మద్దతుగా టీడీపీలో చేరిన కొలిమిగుండ్ల వాసులు

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె:  బనగానపల్లె తెలుగుదేశం కార్యాలయంలో జరిగిన చేరికల కార్యక్రమంలొ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బీసీ జనార్థన్ రెడ్డి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న  కొలిమిగుండ్ల కేంద్రానికి చెందిన రిటైర్డ్ VRO రంగస్వామి, కదిరి నరసి రెడ్డి, రంగస్వామి ( ఎఱ్ఱన్న ),  రంగస్వామి ( నల్లన్న ), ఇగుటూరు సూర్యనారాయణ రెడ్డి, సాంబయ్య, నరసింహుడు, ఇగుటూరు శ్రీకాంత్ రెడ్డి, రవి కుమార్, రాజేష్, రఘు, తలారి రంగస్వామి, కుమార్, మధు, మద్దిలేటి, గుర్రప్ప, చరణ్, పెద్దయ్య, ఓభన్న, ఓబులేష్, అమ్మన్న ఓభన్న,  తదితర 30 కుటుంబాలు టీడీపీలోకి చేరడం జరిగింది.చేరిన నాయకులు మాట్లాడుతూ  బీసీ జనార్దన్ రెడ్డి  మంచితనం మరియు నాయకత్వం కి ఆకర్షతులై , కేవలం చంద్రబాబు నాయుడు  వలెనే రాష్ట్రం అభివృద్ధి చెందుతాయని వైసీపీ ని వీడి టీడీపీలో చేరడం జరిగింది అని తెలిపారు. తెలుగుదేశం పార్టీతోనే  సూపర్ 6 పథకాలతోనే ఆంధ్ర రాష్ట్రానికి నిజమైన సంక్షేమం వస్తుంది అని తెలిపారు.ఈ సందర్బంగా బీసీ జనార్దన్ రెడ్డి  మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసిపి ప్రభుత్వం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో వెనకబడిపోయింది  మనమందరం కలిసి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి గా చేసుకోని ఆంధ్రప్రదేశ్ రాష్టాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకోవాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా టీడీపీ లో చేరిన ప్రతీ ఒక్కరికి  సముచిత స్థానం ఉంటుంది అని అన్నారు.ఈ కార్యక్రమం లో టిడిపి నాయకులు, కార్యకర్తలు, టిడిపి శ్రేణులు, బీసీ అభిమానులు  పాల్గొన్నారు.

About Author