PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కోట్ల” గెలుపుతో ఎమ్మిగనూరులో సంబరాలు

1 min read

పల్లెవెలుగు న్యూస్ ఎమ్మిగనూరు : మాజీ కేంద్ర మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు గౌ శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి  డోన్ శాసనసభ్యులుగా గెలుపొందడంతో కోట్ల వర్గీయులు, టిడిపి శ్రేణులు టిడిపి నేతలు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కే.పార్థసారథి రెడ్డి, ఆరవీటి సుధాకర్ శెట్టి, బనవాసి ఆదినారాయణ రెడ్డి, కదిరికోట ఆదెన్న, కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం టిడిపి కురవ సాధికార కమిటీ సభ్యులు అడ్వకేట్ కేటి మల్లికార్జున, ఎమ్మిగనూరు మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ కందనాతి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు పట్టణంలో సోమప్ప సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి, పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి, మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సంబరాల్లో టిడిపి నాయకులు ఎమ్మిగనూరు మండలం నుండి మల్కాపురం పురుషోత్తమ రెడ్డి,పార్లపల్లి పాపారాయుడు, కడివెల్ల లింగన్న, కే తిమ్మాపురం బీటీ చిన్న హనుమంతు, ఉప్పర వీరేష్, మాసుమాన్ దొడ్డి బోయ శ్రీనివాసులు, గుడికల్ కోలంట్ల నాగరాజు, వెంకటేష్, నందవరం మండలం నుండి ముగతి వీరారెడ్డి,టి. సోమల గూడూరు కమలనాబరెడ్డి, గంగవరం విరుపాక్షి రెడ్డి, రాయచోటి సుధాకర్ రెడ్డి, మారెప్ప, ఎమ్మిగనూరు టౌన్ నుండి మైనార్టీ నాయకులు కేఎండి అబ్దుల్ జబ్బర్, టిడిపి ఎస్సీ సెల్ నాయకులు రోజా ఆర్ట్స్ ఉసేని, రుద్రాక్షల రంగన్న, ఎన్టీఆర్ ఫ్యాన్స్ సప్లయర్స్ బంగారప్ప, అల్వాల ప్రసాద్ తదితరులు ఉన్నారు.

About Author