PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జె.యి.యి. అడ్వాన్స్డ్ ఫలితాలలో కర్నూలు విజేతగా నిలిచిన శ్రీ చైతన్య విద్యాసంస్థలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  నేడు విడుదలైన జె.యి.యి అడ్వాన్స్డ్ ఫలితాలలో కర్నూలు శ్రీ చైతన్య విద్యార్థులు ఆలిండియా స్థాయిలో మంచి రాంయకులు సాధించారని ఎ.జి.ఎమ్.మురళీకృష్ణ తెలియజేశారు. వారిలో కె. హర్శవర్ధన్ ఆలిండియా స్థాయిలో 42 వ ర్యాంకు, కె. శివనారాయణ 51వ ర్యాంకు, పి.ప్రనీత్ రెడ్డి 345వ ర్యాంకు, డి.నోయల్ నయ్ 1538వ ర్యాంకు, ఎ. దీపక్ కుమార్ 6938వ ర్యాంకు, బి. సుజిత్ కుమార్ 7609వ ర్యాంకు, పి.ఉమాలికేశ్ 15678వ ర్యాంకులు సాధించారు. దేశంలో ఇంజనీరింగ్లో ప్రతిష్టాత్మకమైన ఐ.ఐ.టి., ఎన్.ఐ.టి., ఐ.ఐ.ఐ.టి. మరియు జి.ఎఫ్.టి.ఐ. లాంటి విద్యాసంస్థలలో చాలా మంది విద్యార్థులు ఎంపిక కాగలరని ఆశాభావాన్ని తెలియజేశారు.కళాశాలలో జరిగిన అభినందన సభలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను శ్రీ చైతన్య కళాశాళల ఎ.జి.ఎమ్. శ్రీ మురళీకృష్ణ , డీన్ సరళడీన్ బాలాజీఅభినందించారు.

About Author