PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లా ఉన్నతాధికారులను కలిసిన కర్నూలు ఎంపి బస్తిపాటి నాగరాజు

1 min read

జిల్లా సమస్యలు, అభివృద్ధి పై జిల్లా కలెక్టర్, ఎస్పీలతో చర్చించిన ఎం.పి

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు ఎం.పి గా గెలుపొందిన బస్తిపాటి నాగరాజు జిల్లా ఉన్నతాధికారులను మర్యాద పూర్వకంగా  కలిసారు.. జిల్లా కలెక్టర్ సృజన, ఎస్.పి కృష్ణకాంత్ లను కలిసి వారికి పుష్పగుచ్చాలు అందజేశారు.. ఈ సందర్భంగా ఎం.పి జిల్లాలో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి పై వారితో చర్చించారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయం తో జిల్లాను అభివృద్ధి పరుస్తామన్నారు.. ఇక ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నానన్న ఎం.పి నాగరాజు … కర్నూలు జిల్లాను అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లి దశ దిశ మారుస్తానన్నారు.

About Author