PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపి నాయకుడు పార్థీవదేహానికి నివాళులర్పించిన కర్నూలు ఎం.పి

1 min read

రామకృష్ణ మృతి పార్టీకి తీరని లోటు.. ఎం.పి

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  గుండెపోటుతో మృతి చెందిన టిడిపి నాయకుడు బొల్లెద్ధుల రామకృష్ణ భౌతికకాయాన్ని కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు సందర్శించారు.. నగరంలోని సాయిబాబా సంజీవ నగర్ లోని రామకృష్ణ నివాసం వద్ద ఆయన పార్థీవదేహాన్నికి పూల మాల వేసి నివాళులర్పించిన ఎం.పి, అనంతరం రామకృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామకృష్ణ మృతి పార్టీకి తీరని లోటు అని, ఆయన పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారన్నారు.. ఇక రామకృష్ణ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఎం.పి నాగరాజు తెలిపారు.

About Author