PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌ర్నూలు మున్సిప‌ల్ కార్పొరేష‌న్ టిడిపి కైవ‌సం..

1 min read

–  ఎమ్మెల్యే టి.జి భ‌ర‌త్‌

కర్నూలు, పల్లెవెలుగు: క‌ర్నూలు మున్సిప‌ల్ కార్పొరేష‌న్ త్వర‌లోనే తెలుగుదేశం పార్టీ కైవ‌సం అవుతుంద‌ని క‌ర్నూలు ఎమ్మెల్యే టి.జి భ‌ర‌త్ అన్నారు. న‌గ‌రంలోని టి.జి భ‌ర‌త్ కార్యాల‌యంలో 3వ వార్డు కార్పొరేట‌ర్ షాజ‌హాన్ ప‌ర్వీన్, 6వ వార్డు కార్పొరేట‌ర్ షేక్ నీలోఫ‌ర్, 13వ వార్డు కార్పొరేట‌ర్ విజ‌య‌ల‌క్ష్మిలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే టి.జి భ‌ర‌త్ వీరికి కండువాలు వేసి సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంత‌రం ఎమ్మెల్యే టి.జి భ‌ర‌త్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో వార్డుల్లో ఎలాంటి అభివృద్ధి జ‌ర‌గ‌లేద‌న్నారు. ఎమ్మెల్యేగా త‌న నాయ‌క‌త్వంలో ప‌నిచేస్తే ప్ర‌జ‌ల‌కు మంచి జ‌రుగుతుంద‌ని ఇప్పుడు కార్పొరేట‌ర్లు గ్రహించార‌న్నారు. క‌ర్నూలు అభివృద్ధి త‌న‌తోనే సాధ్యమన్నారు. అందుకే కార్పొరేట‌ర్లు సైతం జైకొట్టి త‌మ పార్టీలో చేరుతున్న‌ట్లు చెప్పారు. వీరే కాకుండా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప‌లువురు కార్పొరేట‌ర్లు సిద్ధంగా ఉన్న‌ట్లు ఎమ్మెల్యే టి.జి భ‌ర‌త్‌ తెలిపారు. త‌మ ప్రభుత్వ హ‌యాంలో కార్పొరేష‌న్‌ నిధుల‌ను స‌క్ర‌మంగా వినియోగించి న‌గ‌రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ‌తామ‌న్నారు. పార్టీలో చేరిన వారిలో నాయ‌కులు క్రిష్ణ‌, ఖాద‌ర్‌బాషా, హ‌కీమ్, షేక్ న‌జీర్, త‌దిత‌రులు ఉన్నారు.

About Author