PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంద‌రం క‌లిసి రాష్ట్రాన్ని కాపాడుకుందాం.. క‌ర్నూలు టిడిపి అభ్యర్థి టి.జి భ‌ర‌త్

1 min read

తెలుగుదేశం పార్టీలో చేరిన ధ‌ర్మపేట మ‌హిళ‌లు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: అంద‌రం క‌లిసి రాష్ట్రాన్ని కాపాడుకుందామ‌ని క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భ‌ర‌త్ పిలుపునిచ్చారు. మౌర్య ఇన్‌లోని ఆయ‌న కార్యాల‌యంలో ధ‌ర్మపేట ప్రాంతానికి చెందిన టిడిపి నాయకుడు తిమ్మప్ప ఆధ్వర్యంలో మ‌హిళ‌లు, యువ‌కులు భారీగా త‌ర‌లివ‌చ్చి ఆయ‌న‌కు మ‌ద్దతు తెలిపారు. అనంత‌రం తెలుగుదేశం పార్టీలో చేరారు. టి.జి భ‌ర‌త్ వీరంద‌రికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఈ వైసీపీ పాల‌న మ‌ళ్లీ రాష్ట్రానికి వ‌ద్దన్నారు. పొర‌పాటున ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే ఘోర‌మైన ప‌రిస్థితులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌న్నారు. ఏ ప్రాంతానికి వెళ్లినా స‌మ‌స్యలే ఉన్నాయ‌న్నారు. అర్హుల‌కు సంక్షేమ ప‌థ‌కాలు అంద‌డం లేద‌ని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌స్తేనే ప్రజ‌ల‌కు మంచి భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని టి.జి భ‌ర‌త్ పేర్కొన్నారు. క‌ర్నూల్లో 40 ఏళ్లుగా ప్రజాసేవ‌లోనే ఉన్నట్లు ఆయ‌న చెప్పారు. త‌న‌ను గెలిపిస్తే ప్ర‌జ‌ల‌కు ఐదేళ్లపాటు మంచి పాల‌న అందిస్తాన‌న్నారు. రాష్ట్రంలో ఎన్డీయే కూట‌మి అధికారం చేప‌ట్టడం ఖాయ‌మ‌న్నారు. త‌మ ప్రభుత్వంలో అర్హులంద‌రికీ సంక్షేమ పథ‌కాలు అందిస్తామ‌న్నారు. ఐదేళ్లలో పేద‌ల‌కు ఇల్లు, ఇళ్ల ప‌ట్టాలు అంద‌జేస్తామ‌ని తెలిపారు. ఇవ‌న్నీ స‌క్రమంగా అందాలంటే త‌న‌లాంటి స‌రైన నాయ‌కుడు ఎమ్మెల్యేగా ఉండాల‌ని టి.జి భ‌ర‌త్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జ‌న‌సేన అసెంబ్లీ ఇంచార్జి అర్షద్, టిడిపి నాయ‌కులు సురేంద్ర‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.

About Author