PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌ర్నూలు ప్రజ‌ల‌కు ఎల్లప్పుడూ అండ‌గా ఉంటా.. క‌ర్నూలు టిడిపి అభ్యర్థి టి.జి భ‌ర‌త్

1 min read

ఎన్‌.ఆర్ పేట‌లో టి.జి భ‌ర‌త్ భ‌రోసా యాత్ర‌

టి.జి భ‌ర‌త్‌తో క‌లిసి ప్రచారంలో పాల్గొన్న‌ బి.టి నాయుడు, తిక్కారెడ్డి

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  క‌ర్నూలు ప్రజ‌ల ఆశీర్వాదంతో గెలిచి నియోజ‌క‌వ‌ర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాన‌ని క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థి టి.జి భ‌ర‌త్ అన్నారు. న‌గ‌రంలోని ఎన్.ఆర్ పేట‌లో ఆయ‌న టి.జి భ‌ర‌త్ భ‌రోసా యాత్ర కార్యక్రమం చేప‌ట్టారు. ఈ యాత్రలో ఎమ్మెల్సీ బి.టి నాయుడు, జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి పాల్గొన్నారు. టి.జి భ‌ర‌త్‌తో క‌లిసి ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీని గెలిపించాల‌ని నాయ‌కులు కోరారు. అనంత‌రం టి.జి భ‌ర‌త్ మాట్లాడుతూ వైసీపీ అరాచ‌క పాల‌న చూసిన ప్రజ‌లు త‌మ‌ను ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నార‌ని పేర్కొన్నారు. ఐదేళ్ల పాటు న‌ర‌కం చూసిన ప్రజ‌లు తెలుగుదేశం పార్టీ విజ‌యాన్ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు. ఒక్క అవ‌కాశం అని అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ మ‌ళ్లీ అధికారం అడ‌గ‌టానికి వీళ్లేకుండా అరాచ‌క పాల‌న సాగించింద‌ని మండిప‌డ్డారు. న‌గ‌రంలోని ఏ వార్డుకు వెళ్లినా త‌న‌కు ప్రజ‌ల నుండి విశేష స్పంద‌న ల‌భిస్తోంద‌న్నారు. త‌మ పార్టీ మేనిఫెస్టో వ‌ల్ల ప్రజ‌ల జీవితాలు బ్రహ్మాండంగా బాగుప‌డ‌తాయ‌ని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మ‌న రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రజ‌ల‌ కోసం సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లుచేయ‌బోతున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నిక‌ల్లో కూట‌మి భారీ విజ‌యం సాధించ‌బోతుంద‌న్నారు. క‌ర్నూలు ప్రజ‌ల మ‌ద్దతుతో తాను గెలిచి ప్రజ‌ల‌కు ఇబ్బందులు లేకుండా చూసుకుంటాన‌ని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జి విక్రమ్ సింగ్, లీగ‌ల్ సెల్ నాయ‌కులు దాశెట్టి శ్రీనివాసులు, కౌశిక్, నాగేంద్ర సింగ్, శంక‌ర్ సింగ్, అనురాద‌, చంద్రశేఖ‌ర్, సాయి, విజ‌య్, చంద్ర‌కాంత్, ల‌క్ష్మన్న‌, అన్వర్, ప్రవీణ్‌, వినోద్, సునీల్, న‌వీన్, తిరుమ‌ల్ నాయుడు, బ‌షీరున్, మ‌ణి ప్ర‌కాష్‌, భాస్కర్, పుల్లయ్య నాయుడు, సాయ‌త్ బీ, వెంక‌టేశ్వర్లు, మ‌ద్దిలేటి, భ‌వానీ శంక‌ర్, త‌దిత‌ర ముఖ్య నాయ‌కులు పాల్గొన్నారు.

About Author