PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భక్తిశ్రద్ధలతో లక్ష్మమ్మ అవ్వ జాతర

1 min read

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం:  మండల పరిధిలోని సుంకేశ్వరి గ్రామంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా లక్ష్మమ్మ అవ్వ జాతర గ్రామ ప్రజల అధ్వర్యంలో శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుండి లక్ష్మమ్మ అవ్వ కు నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం లక్ష్మమ్మ అవ్వ రథం ను వివిద రకాల పుష్పాలంకరణ చేసి పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ ప్రజల హర్షధ్వనుల మద్య మేళ తాళాలతో బాణాసంచా కాల్చి ఊరేగింపు నిర్వహించారు. ఈ ఉత్సవాలు తిలకించేందుకు చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాధవరం ఎస్సై కృష్ణ మూర్తి ఆధ్వర్యంలో ఏఎసై బందేనవాజ్ తమ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

About Author