PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బైరెడ్డిని కలిసిన వడ్డెర సంఘం నాయకులు..

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ని నంద్యాల జిల్లా వడ్డెర సంఘ నాయకులు కర్నూలు లోని బైరెడ్డి స్వగృహంలో శనివారం వడ్డెర సంఘం నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల జిల్లాలో ఏడు అసెంబ్లీ మరియు ఒక పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించడానికి తన రాజకీయ పలుకుబడితో జిల్లా గెలుపు కోసం కీలక పాత్ర పోషించిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని వడ్డెర సంఘం నాయకులు తలముడిపి చక్రధర్ అన్నారు. బైరెడ్డిని శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు.బైరెడ్డి కూతురు ఎంపీ శబరి గెలుపు కోసం వడ్డెర సంఘం ఆధ్వర్యంలో గెలుపునకు కృషి చేశామని అంతే కాకుండా ఎంపీగా లక్షకు పైగా భారీ మెజారిటీతో గెలుపొందడం హర్షించదగ్గ విషయమని వారు అన్నారు. రాబోయే రోజుల్లో వడ్డెరలకు ఉన్న సమస్యలను పరిష్కరించాలని అదే విధంగా వడ్డెరల అభివృద్ధికి తమ వంతుగా కృషి చేయాలని బైరెడ్డిని వారు కోరినట్లు తెలిపారు.మీకు ఎల్లప్పుడూ తమ వంతుగా సహకారం అందిస్తామని బైరెడ్డి హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. ఈకార్యక్రమంలో వడ్డె శివశంకర్,వడ్డె శివమణి,వడ్డె శ్రీను,శంకర్,రాజు తదితరులు పాల్గొన్నారు.

About Author