PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విభేదాలు వీడి..గెలుపుకు కృషి చేయండి: శాప్ చైర్మన్

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నాయకులు విభేదాలు వీడి పార్టీ గెలుపునకు కృషి చేయాలని శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నాయకులకు దిశా నిర్దేశం చేశారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని చౌటుకూరు గ్రామానికి సాయంత్రం నంద్యాల వైసీపీ ఎంపీ అభ్యర్థి ప్రస్తుత ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి మరియు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తండ్రి బైరెడ్డి మల్లికార్జున రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా వారు గ్రామానికి వచ్చిన సంగతి తెలిసిందే.ఆరోజున ముఖ్య నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లి వారితో మాట్లాడారు.గ్రామ వైసీపీ సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి ఇంటికి బైరెడ్డి మల్లికార్జున రెడ్డి మాత్రమే వెళ్లారు నంద్యాల ఎంపీ వెళ్లక పోవడం పట్ల ఆయన అలకబూ నినట్లు ఇదే విషయాన్ని సిద్ధార్థ రెడ్డి దృష్టికి ఆయన ఈ విషయాన్ని తెలపడంతో మరుసటి రోజు ఉదయం 6:30 కే చౌటుకూరు గ్రామానికి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేరుకున్నారు. గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో డ్రమ్స్ నడుమ భారీ ఊరేగింపుతో ఘన స్వాగతం పలికారు. ముందుగా గోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లిన సిద్ధార్థ రెడ్డి తర్వాత వినోద్ రెడ్డి,మాజీ సర్పంచ్ చాంద్ బాష ఇంటికి ఆయన వెళ్లి నాయకులతో మాట్లాడారు.ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలకు అందించిన ప్రభుత్వ పథకాల గురించి ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరిస్తూ చిన్న చిన్న విషయాలను మనుసులో పెట్టుకోకుండా పార్టీ గెలుపునకు మీరంతా కృషి చేయాలని ఆయన నాయకులకు తెలియజేశారు.గ్రామాల్లో ఏ చిన్న కార్యక్రమం జరిగినా సిద్ధార్థ రెడ్డి కార్యక్రమాలకు హాజరవుతూ మంచి వాక్చాతుర్యంతో యువకులను ప్రజలను ఆకట్టుకోవడంలో ఆయనలో ప్రత్యేకత ఉందనే చెప్పవచ్చు.అంతేకాదు వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ఆయన చేస్తున్న కృషి ఎనలేనిది.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తువ్వా చిన్న మల్లారెడ్డి,గ్రామ నాయకులు వినోద్ రెడ్డి, బాలిరెడ్డి,సాదిక్ తదితరులు పాల్గొన్నారు.

About Author