PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తెలుగుదేశం పార్టీని గెలిపించండి.. మాజీ ఎంపీపీ

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది:  తెలుగుదేశం పార్టీని గెలిపించాలని మహానంది మండల మాజీ ఎంపీపీ చింతా నాగమణి గోపవరం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీశైలం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఎంపీ అభ్యర్థి శబరిని గెలిపించాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రామాలను ఎంతో అభివృద్ధి చేశారని మరల అధికారంలోకి వస్తే గ్రామాల అభివృద్ధికి సాధ్యపడుతుందన్నారు. ఆమె వెంట పలువురు మహిళలు పాల్గొన్నారు.

About Author