PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైఎస్ఆర్సిపి అభ్యర్థులను గెలిపించుకుందాం

1 min read

రాష్ట్ర ప్రగతిని మరింత మెరుగు పరుచుకుందాం

వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మల్ల సాయి

పల్లెవెలుగు వెబ్  చెన్నూరు : ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉన్నారని, మళ్లీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు పట్టం కడితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఎంతైనా ఉందని వైయస్సార్సీపి విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మల్ల సాయికుమార్ రెడ్డి అన్నారు, బుధవారం ఆయన చెన్నూర్ లో విలేకరులతో మాట్లాడుతూ, వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం తరపున వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు దత్త సాయి, వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ లక్ష్మణ్ రెడ్డి, కమలాపురం నాలుగో వార్డ్ కౌన్సిలర్ రాజోలి నిఖిల్ రెడ్డి లు కలిసి జిల్లాలోని అన్ని కళాశాలలోని విద్యార్థులను కలసి వైయస్సార్సీపి అభ్యర్థుల గెలుపు కోసం తమ వంతు కృషి చేయాలని కోరినట్లు ఆయన తెలిపారు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని అందరూ కలిసి మరోసారి ఆశీర్వదిస్తే ఆయన రాష్ట్ర అభివృద్ధికే కాకుండా నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా మరింత మెరుగైన పాలనను అందించడం జరుగుతుందని తెలిపారు, ఇప్పటికే కుల, మత, పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే నన్నారు, సంకీర్ణ ప్రభుత్వం కావాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కావాలని ఆయన ఆకాంక్షించారు.

About Author