PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బాలనాగిరెడ్డి ని గెలిపించండి

1 min read

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం:   మంత్రాలయం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బాలనాగిరెడ్డి ని  13వ తేదిన జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు కు ఓటు వేసి అత్యదిక మెజార్టీ తో గెలిపించాలని అలాగే  ఎంపీగా బీవై. రామయ్య ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వైకాపా నియోజకవర్గ మహిళా నాయకురాలు ప్రియాంక రెడ్డి, అనుష, కుమారి, వీణ, మమత ప్రజలను కోరారు. గురువారం మండల పరిధిలోని చెట్నెహాళ్లి గ్రామంలో వైకాపా మండల అధ్యక్షులు జి. భీమారెడ్డి, సి. వి. విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి 2019లో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గురించి వివరించారు. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తు కు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అంజిని, ఉప సర్పంచ్ వీరనాగప్ప, ఎంపిటిసి సభ్యులు రామాంజనేయులు, మాజీ సర్పంచ్ అల్లింగప్ప, గంగుల వెంకటేష్, మల్లి, నరసింహులు, నాగేంద్ర, పరశప్ప, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author