PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధీర్ ను గెలిపించండి

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: జగనన్న ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో ఆదరించి గెలిపించాలని శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తండ్రి బైరెడ్డి మల్లికార్జున రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని కడుమూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ ఎస్ జీవరత్నం మరియు గ్రామ వైసీపీ సీనియర్ నాయకులు శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.బుధ,గురువారాల్లో సాయంత్రం ఆయన ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం చేపట్టారు.వచ్చేనెల 13న జరిగే ఎన్నికల్లో నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ దార సుధీర్ కు ఓటు వేసి గెలిపించాలని ఆ యన ప్రజలకు కరపత్రాలను పంచుతూ చేతులు జోడిస్తూ ఓటును అభ్యర్థించారు.రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అన్నారు.మళ్లీ ఈ ప్రభుత్వం వస్తేనే ప్రస్తుతం ఉన్న పథకాలను మళ్లీ కొనసాగుతాయని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పర్వత యుగంధర్ రెడ్డి,వైసీపీ మండల కన్వీనర్ తువ్వా లోకేశ్వర్ రెడ్డి,ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి,విశ్వం రెడ్డి,వైసీపీ మండల వైస్ ప్రెసిడెంట్ అన్వర్ భాష,సహకార సొసైటీ చైర్మన్ నాగ తులసి రెడ్డి,మార్కెట్ యార్డ్ డైరెక్టర్ జగదీశ్వర్ రెడ్డి,మల్లేశ్వర రెడ్డి,కడుమూరు మాజీ సర్పంచ్ హిదాయతుల్లా, రెహమాన్,కిషోర్ వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

About Author