PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సంక్షేమాభివృద్ధికి పట్టం కడుదాం – బుట్టా ప్రతుల్

1 min read

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు:  ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండలం గంజిహల్లి గ్రామం  నందు ఎమ్మిగనూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక  కుమారుడు “బుట్టా ప్రతుల్”  ఆధ్వర్యంలో గడప గడపకు ఎన్నికల ప్రచారంలో బాగంగా బుట్టా ప్రతుల్  ప్రతి ఇంటికి వెళ్లి ,పార్లమెంట్ అభ్యర్థి బివై. రామయ్య,ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక కి ఓటు వేయాలని ఓటర్లను కోరారు.బుట్టా ప్రతుల్  వారితో మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి  ఐదేళ్ల పాలనలో అవినీతి రహిత పాలన అందించారని కుల,మత,రాజకీయాలకు అతీతంగా ప్రతి గడపకి చేరవేస్తామని గుర్తు చేశాను.రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి ఆఖండ మెజారిటీ తో గెలిపించాలని కోరడం జరిగింది.ఈ ప్రచారంలో గోనెగoడ్ల మండలం యూత్ నాయకులు బందేనవజ్ , యువ నాయకులు రవి కుమార్ నాయుడు,సింగిల్ విండో వైస్ ప్రెసిడెంట్  భాస్కర్ రెడ్డి, మండల కన్వీనర్ దొరబాబు,మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ మన్సూర్,సర్పంచ్ రాముడు, తిరుమల్ రెడ్డి,మహేశ్వర రెడ్డి, బందేనవాజ్, రఫీక్,మరియు వారి అనుచరులు, వైసీపీ పార్టీ ముఖ్య నేతలు ,వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

About Author