PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వరద బాధితులకు చేయూతనిద్దాం… సిపిఐ

1 min read

వరద బాధితుల సహాయార్థం సిపిఐ నాయకులకు నిత్యావసర వస్తువులు, నూతన వస్త్రాలను అందజేస్తున్న పట్టణ టైలర్స్ అసోసియేషన్ సభ్యులు, ప్రభాస్ అభిమానులు.

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సర్వసం కోల్పోయిన విజయవాడ వరద బాధితుల కు తమ వంతు  చేయూత నివ్వాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక చదువుల రామయ్య భవనంలో వరద బాధితులకు సహాయార్థంగా పట్టణ టైలర్స్ అసోసియేషన్ నాయకులు, ప్రభాస్ అభిమానులు నిత్యావసర వస్తువులు,  బియ్యం, మంచి నూనె పాకెట్లు, నూతన వస్త్రాలను  సిపిఐ నాయకులకు అందజేశారు. ఈ సందర్భంగా బి. గిడ్డయ్య మాట్లాడుతూ, ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా మునుపెన్నడులేని విధంగా విజయవాడ నగర ప్రజలు తీవ్రంగా నష్టపోవడం జరిగిందని, వరద బాధితులకు తమ వంతు బాధ్యతగా సహాయ సహకారాలు అందించి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. వరద బాధితులకు సహాయం అందించిన వస్తువులను తమ పార్టీ ద్వారా బాధితులకు నేరుగా పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు పి. భీమ లింగప్ప, మండల కార్యదర్శి డి. రాజా సాహెబ్, పట్టణ కార్యదర్శి రామాంజనేయులు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కారుమంచి, సిపిఐ జిల్లా సమితి సభ్యులు కారన్న, తిమ్మయ్య, పెద్ద ఈరన్న, మండల సహాయ కార్యదర్శి రంగన్న, టైలర్స్ అసోసియేషన్ నాయకులు, ప్రభాస్ ఫ్యాన్స్ పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *