PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మరోసారి వైఎస్సార్సీపీ జెండా ఎగుర వేద్దాం…

1 min read

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు:  గోనెగండ్ల మండల కేంద్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక  తనయుడు బుట్టా ప్రతుల పార్టీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు.మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గోనెగండ్లలో మరోసారి వైఎస్సార్సీపీ జెండా ఎగుర వేద్దామని బుట్టా ప్రతుల్  పిలుపునిచ్చారు. గోనెగండ్ల మండల కేంద్రంలో ఇంటింటికీ తిరుగుతూ రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలంటూ ప్రచారం చేశారు.ఈ ప్రచారంలో గోనెగoడ్ల మండలం యూత్ అధ్యక్షులు బందేనవాజ్,యువ నాయకుడు రవి కుమార్ నాయుడు,మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ మన్సూర్,మండల కన్వీనర్ దొరబాబు, మండల JCS కన్వీనర్ మనోహర్ రెడ్డి,మురళీ నాయుడు, ఎంపీటీసీలు ముఖ్య నాయకులు,సచివాలయం కన్వీనర్లు,గృహ సారథులు,వార్డు  కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author