PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీడీపీని గెలిపిద్దాం..అభివృద్ధి చేసుకుందాం

1 min read

– ఈవీఎం ప్యాట్ నమూనా ఓటుపై ఓటర్లకు అవగాహన కల్పించిన:కౌన్సిలర్ జాకీర్

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు(నందికొట్కూరు): సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందామని అంతేకాకుండా ప్రతి కార్యకర్త గెలుపునకు కృషి చేయాలని నందికొట్కూరు పట్టణ 2 వ వార్డ్ కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్ అన్నారు.శనివారం ఉదయం వార్డులో ఇంటింటికి తిరుగుతూ ఈవీఎం ప్యాట్ నమూనా ద్వారా ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకోవాలనే వాటిపై ఓటర్లకు ప్రాక్టికల్ గా ఆయన అవగాహన కల్పించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి జరుగుతుందని గత ఐదేళ్ల పాలనలో అభివృద్ధి ఎక్కడా కూడా అభివృద్ధి జాడే లేదని ప్రజలు బ్రతకలేనంతగా ప్రస్తుతం సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయని అంతే కాకుండా రాష్ట్రానికి అనుభవజ్ఞులైన నాయకుడు ఉంటేనే అభివృద్ధి చెందుతుందని రేపు జరిగే ఎన్నికల్లో మన ప్రాంతవాసులు అయిన టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గిత్త జయసూర్య,ఎంపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరిలను సైకిల్ గుర్తుకు రెండు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటే మనం అభివృద్ధి చెందుతామని కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్ వార్డు ప్రజలకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బూత్ ఇన్చార్జి హుస్సేన్,ముత్తు,పెద్ద శాలు,నడిపి శాలు,చిన్న షాలు, మట్ట,నిసార్,రియాజ్,ఆఫ్రిద్, అబ్బాస్,రిజ్వన్ తదితరులు పాల్గొన్నారు.

About Author