PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంత్రి బీసీ..అధికారులకు ప్రశంసా పత్రాలు

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గుత్త సురేష్ కుమార్ మరియు నందికొట్కూరు మండల వ్యవసాయ శాఖ అధికారి షేక్షావలికి..పగిడ్యాల మండల తహసిల్దార్ కార్యాలయంలో ఏఎస్ఓ గా ఉన్న ఈడిగ ఎల్లగౌడు అను వీరి ముగ్గురు ఉత్తమ ప్రశంసా పత్రాలు అందుకున్నారు. గురువారం 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా నంద్యాల జిల్లా కేంద్రంలో డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మరియు నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి చేతుల మీదుగా ఉత్తమ అధికారులుగా గుర్తిస్తూ ప్రశంసా పత్రాలను అందజేశారు.మిడుతూరు మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ చక్రవర్తి 06.06.2023 నుండి పనిచేస్తున్నారు.పగిడ్యాల ఏఎస్ఓ ఎల్లగౌడ్ 2023 నుండి 2024 జులై వరకు సంవత్సరం పాటు నందికొట్కూరు ఏఎస్ఓ ఇన్చార్జిగా పనిచేశారు.

About Author