PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మద్యం దుకాణాలు బంద్

1 min read

ఆన్లైన్ పేమెంట్ తో ఇబ్బందులు పడుతున్న మద్యం ప్రియులు

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: ఈనెల 13వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంటు అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా శనివారం సాయంత్రం నుంచి చెన్నూరు లో ఉన్న మూడు మద్యం దుకాణాలను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. మద్యం కోసం షాపులు వద్ద మద్యం ప్రియులు క్యూ కట్టారు. గత మూడు రోజుల నుంచి మద్యం కోసం ఆన్లైన్ పేమెంట్ చేయడంతో ఫోన్ పే గూగుల్ పే ఉన్నవారు మాత్రమే మద్యం షాపుల వద్ద మద్యం కొనుగోలు చేస్తున్నారు. అయితే అయితే ఇతరులు తమ దగ్గర సెల్లులు గూగుల్ పే ఫోన్ పే లేకపోవడంతో మద్యం తాగేవారు అనేక ఇబ్బందులు పడ్డారు. షాపుల్లో ఖరీదైన మధ్యనే దొరుకుతుండడంతో చాలామంది వెలు తిరిగారు. అయితే దుకాణాలనుంచి ముందుగానే కొంతమంది మద్యాన్ని కొనుగోలు చేసుకున్నారు. ఆదివారం సోమవారం రెండు రోజులు ఎన్నికల దృష్టిలో పెట్టుకొని షాపుల్లో మద్యం విక్రయించకుండా ఎక్సైజ్ అధికారులు షాపులను సీజ్ చేశారు.

About Author