PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహాత్మ గాంధీజీ మార్గం ఆచరణీయం -మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  అహింసే ఆయుధంగా స్వాతంత్ర పోరాటం చేసిన మహాత్మా గాంధీ మార్గం ప్రతి ఒక్కరూ ఆచరించదగినదని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు.స్థానిక మౌర్య ఇన్ నందు ఉన్న కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి టీజీ వెంకటేష్ ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా రచయిత, సినీ దర్శకుడు మోటకట్ల సుబ్బారెడ్డి రచించిన “మహాత్మా గాంధీ మళ్ళీ పుడితే” అనే నాటక పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.మహాత్మాగాంధీ చూపించిన మార్గం ప్రతి ఒక్కరు అనుసరించదగ్గది అయినప్పటికీ , ఇప్పటి తరం వారు ఎవరు ఆచరించట్లేదు అన్నారు. అహింస ఆయుధంగా ప్రపంచంలో ఎవరు పోరాటాలు చేయలేదని ఒక గాంధీ మహాత్ముడు మాత్రమే అహింసను ఆయుధంగా చేసుకుని స్వాతంత్ర పోరాటం సాగించిన వ్యక్తిని టీజీ వెంకటేష్ కొనియాడారు.గాంధీజీ సిద్ధాంతాలను ఇప్పటి తరం వారికి తెలియజేస్తూ, వారు ఆచరించే విధంగా ప్రచారం కల్పించాలని ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ కోరారు ఈ కార్యక్రమంలో రచయిత మోటకట్ల, సుబ్బారెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ మురళీధర్ గౌడ్, టీజీవి ట్రేడ్ యూనియన్ నాయకులు బాలయ్య, శేషగిరి శెట్టి, పాల్ రాజు, సుభాన్ తదితరులు పాల్గొన్నారు.

About Author