PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నందికొట్కూర్ లో చెంప చెల్లు మనేలా మెజార్టీ..

1 min read

ప్రజల తీర్పు..జీవితాంతం రుణపడి ఉంటా

“ఇది మన ప్రభుత్వంలో”ఎమ్మెల్యే గిత్త

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నందికొట్కూరులో తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని అన్న వారందరికీ వారి చెంప చెల్లుమనేలా నియోజకవర్గ ప్రజలు మంచి మెజార్టీని ఇచ్చి నన్ను గెలిపించారని నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య అన్నారు. నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండల పరిధిలోని మండ్లెం గ్రామంలో శుక్రవారం ఉదయం జరిగిన “ఇది మన ప్రభుత్వం”అనే కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అయిన శుభ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందని కూటమి నాయకులు మరియు అధికారులు ఇంటింటికి వెళ్ళాలని పార్టీ ఆదేశించిందని అన్నారు.ప్రజల సమస్యలను నెరవేర్చేందుకు ప్రజలు నాకు అవకాశం ఇచ్చారని నియోజకవర్గ ప్రజలకు నా జీవితాంతం రుణపడి ఉంటానని సంక్షేమంలో ఉన్న రాష్ట్రాన్ని గత ప్రభుత్వంలో సంక్షోభంలోకి తీసుకువెళ్లారని గ్రామాలకు వచ్చిన నిధులను అన్నింటినీ కూడా నిర్వీర్యం చేశారని గ్రామాల్లో రోడ్లు వీధిలైట్లు కనీసం గ్రామాల్లో మౌలిక సదుపాయాలు గత ప్రభుత్వంలో కల్పించలేదని గత ప్రభుత్వంపై ఎమ్మెల్యే విరుచుకుపడ్డారు.గత ప్రభుత్వంలో ఒక్క డీఎస్సీ పోస్టు కూడా ఇవ్వలేకపోయిందని ఈ ప్రభుత్వం16,345 డీఎస్సీ పోస్టులకు మొదటి సంతకాన్ని ముఖ్యమంత్రి చేశారని అన్నారు.తర్వాత గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఇది మన ప్రభుత్వం అనే స్టిక్కర్లను ఆయన అతికించారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి,మండల కన్వీనర్ వెంకటేశ్వర్లు యాదవ్,జిల్లా అధికార టిడిపి ప్రతినిధి గిరీశ్వరరెడ్డి,సర్పంచ్ కృపమ్మ,జనసేన నియోజకవర్గ సమన్వయకర్త నల్లమల రవికుమార్,బిజెపి నాయకులు చల్లా దామోదర్ రెడ్డి, అధికారులు నాయకులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *