PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యాస్పిరేషనల్ బ్లాక్ లను అభివృద్ధి అంశాల పై పురోగతి సాధించండి

1 min read

నీతి ఆయోగ్ సీఈవో సుబ్రహ్మణ్యం

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జిల్లాలో యాస్పిరేషనల్ బ్లాక్ లుగా ఎంపికైన చిప్పగిరి,  మద్దికెర (ఈస్ట్),  హోళగుంద బ్లాక్ ల అభివృద్ధి అంశాల పై పురోగతి సాధించాలని నీతి ఆయోగ్ సీఈవో సుబ్రహ్మణ్యం జిల్లా కలెక్టర్ కి సూచించారు. గురువారం ఢిల్లీ నుండి నిర్వహించిన నీతి ఆయోగ్ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన కలెక్టర్ ఛాంబర్ నుండి పాల్గొన్నారు.సందర్భంగా కలెక్టర్ ముందుగా చిప్పగిరి,  మద్దికెర (ఈస్ట్),  హోళగుంద బ్లాక్ ల డెవలప్‌మెంట్ కు సంబంధించిన ఆరోగ్యం, పోషకాహారం, విద్య, వ్యవసాయం, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్  తదితర అభివృద్ధి అంశాల పై నీతి ఆయోగ్ సీఈవో కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ వివరించారు.. తదనంతరం చిప్పగిరి,  మద్దికెర (ఈస్ట్),  హోళగుంద బ్లాక్ డెవలప్‌మెంట్ లకు సంబంధించిన  అభివృద్ధి అంశాల పై నిర్దేశించిన లక్ష్యాలను సాచ్యురేషన్ మోడ్ లో సాధించాలని నీతి అయోగ్ సీఈవో  కలెక్టర్ కి సూచించారు.కలెక్టరేట్ ఎన్ఐసి నుండి వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో పాల్గొన్న సిపిఓ  హిమప్రభాకర్ రాజు తదితరులు పాల్గొన్నారు.

About Author