PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

థాలి భజావో నిరసనను విజయవంతం చేయండి

1 min read

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు  పి మురళీకృష్ణ

పల్లెవెలుగు  వెబ్ కర్నూలు:         ఈనెల 25వ తేదీన కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కలెక్టర్ ఎదురుగా థాలీ బజావో కార్యక్రమమును విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పి మురళీకృష్ణ గారు పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో కర్నూలు పరిధి నందలి కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాలు, కార్యకర్తల సమీక్షా సమావేశంలో మురళీకృష్ణ గారు మాట్లాడుతూ  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు 100 రోజులైనా అమలు చేయకపోవడం తెలుగుదేశం ప్రభుత్వం చేతగాని తనానికి నిదర్శనమని సూపర్ సిక్స్ పథకాలు వెంటనే అమలు చేయాలని కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలా రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈనెల 25వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల  ఎదురుగా థాలి బజావో {ప్లేట్లను గరిటెలతో వాయిస్తూ నిరసన} అనే నినాదంతో నిరసన కార్యక్రమము చేపట్టాలని ఆదేశించారని అందులో భాగంగా కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరుగు ఈ కార్యక్రమమునకు కర్నూలు జిల్లా నందలి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ నాయకులు అనుబంధ సంస్థల నాయకులు కార్యకర్తలు, అభిమానులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ నిరసన కార్యక్రమమును విజయవంతం చేయవలెనని మురళీకృష్ణ గారు కోరడమైనది. ఈ కార్యక్రమంలో కర్నూలు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాష, కాంగ్రెస్ నాయకులు దామోదరం రాధాకృష్ణ, ఎన్ సి బజారన్న, కే వెంకటరెడ్డి, జి వెంకటస్వామి, రియాజుద్దీన్, షేక్ ఖాజా హుస్సేన్,  ముషీద్ పీర్ ఖాద్రి, అనంత రత్నం, ఈ లాజరస్, ఎస్ ప్రమీల, ఏ వెంకట సుజాత, అమనుల్లా, షేక్ మాలిక్ భాష, డబ్ల్యూ సత్యరాజు, బి సుబ్రహ్మణ్యం, ఎజాస్ అహ్మద్, ఐ ఎన్ టి యు సి నాయకులు ఆర్ ప్రతాప్ జేమ్స్ ఆశీర్వాదం జాన్ సదానందం ఆర్ విక్టర్ రజాక్ వలి వెల్దుర్తి శేషయ్య అభి నాయుడు కేశవరెడ్డి కే వెంకటలక్ష్మి రంగస్వామి మొదలగు వారు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *