PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మలబార్ గోల్డ్ & డైమండ్స్ లో “నువ”డైమండ్ కలెక్షన్స్  ఆవిష్కరణ

1 min read

పల్లెవెలుగు వెబ్ విజయవాడ: ప్రపంచ వ్యాప్తంగా అరవ అతి పెద్ద జ్యువెలరీ రిటైలర్ గా ప్రఖ్యాతిగాంచిన మలబార్ గోల్డ్ & డైమండ్స్ యుఎఇ లో జరిగిన ఒక గ్రాండ్ ఈవెంట్ లో ‘నువ’ పేరుతో తమ సరికొత్త వజ్రాభరణాల సేకరణను ఆవిష్కరించారు. ప్రఖ్యాత భారత సినీ నటి కరీనా కపూర్ ఖాన్ ఈ ‘నువ’ కలెక్షన్ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా విజయవాడ బందరు రోడ్ షోరూం లో వినియోగదారులు,షోరూం సిబ్బంది ఆధ్వర్యంలో అవిష్కరించారు. ఈ సందర్భంగా తేజప్రియ మాట్లాడుతూ ప్రకృతి ప్రసాదించిన సంక్లిష్టమైన ఆకృతులు, అలలు, వివిధ రూపాలు, మడతలు, అల్లికల నుండి ప్రేరణ పొంది, విలాసవంతమైన వజ్రాభరణాలుగా ఆద్భుతంగా రూపొందించబడిన ఒక వేడుక ఈ ‘నువ’ సేకరణ అని అన్నారు. గత పది సంవత్సరాలుగా ఈ షోరూంకు వస్తున్నట్లు తెలిపారు. యువతులకు అభిరుచికి తగ్గట్టుగా ‘నువ’ కలక్షన్స్ ఉన్నాయన్నారు.అనంతరం మలబార్ గోల్డ్&డైమండ్స్ షోరూం టీం సెల్స్ మేనేజర్  కాశీమ్ మాట్లాడుతూ “ప్రకృతి, మహిళల అలుపెరగని స్ఫూర్తి ఈ రెండింటినీ వేడుకగా జరుపుకునే ‘నువ’ సేకరణ పరిచయం చేయడం మాకు చాలా గర్వంగా ఉంది. ఈ సేకరణలోని ప్రతి భాగం అపారమైన శ్రద్ధ మరియు ఖచ్చితత్వంతో రూపొందించబడింది. ఇది ప్రకృతి యొక్క క్లిష్టమైన అందాన్ని, మహిళల మనోభావాలను ప్రతిబింబిస్తుంది ‘నువ’ సేకరణకు సంపూర్ణ ప్రతిబింబంలా నిలబడే కరీనా కపూర్ ఖాన్ ఈ సేకరణ ప్రారంభించినందుకు మాకు గౌరవంగా ఉంది అన్నారు.ఈ కార్యక్రమంలో జానేదా,రుక్సాన్,నైమిష్య ,మలబార్ గోల్డ్ డైమండ్స్ షోరూం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author