PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మనస్థాపానికి గురై వ్యక్తి మృతి

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు:   మండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన గాజుల పల్లె శివ నాద రెడ్డి (41) సంవత్సరాలు అనే వ్యక్తి అవమానపారంతో మనస్థాపానికి గురై గురువారం రాత్రి తన ఇంటిలో ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ నారాయణ యాదవ్ తెలిపారు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి, గాజులపల్లి శివనాథరెడ్డి కడపలో ఒక ప్రైవేటు ట్రావెల్స్ లో పనిచేస్తుండేవాడని తెలిపారు, అయితే అతనికి ఆర్థిక ఇబ్బందులు ఉన్న కారణంగా అతను కడప నబికోట్ కు చెందిన కొప్పర్తి మోహన్ రెడ్డి అనే ఫైనాన్సర్ వద్ద ఒక లక్ష 72 వేల రూపాయలు అప్పుగా తీసుకోవడం జరిగిందన్నారు, ఈ క్రమంలో ఫైనాన్సర్ మోహన్ రెడ్డికి అతను దాదాపు ఆరు లక్షల 80 వేల రూపాయల వరకు డబ్బులు చెల్లించడం జరిగిందన్నారు, అయినప్పటి సదరు ఫైనాన్సర్ తనకు ఇంకా బాకీ ఉన్నాడని తన బాకీ చెల్లించాలంటూ వేధించడమే కాకుండా గత నెల 31వ తేదీ కడప 7 రోడ్లు కూడలి వద్ద రాత్రి 10 గంటల సమయంలో మోహన్ రెడ్డి శివనాథరెడ్డిని దుర్భాషలాడుతూ అవమానకరంగా మాట్లాడడమే కాకుండా అతని వద్ద ఉన్న 7వేల రూపాయలు లాకెళ్లినట్లు తెలిపారు, అనంతరం మృతుడు శివనాథరెడ్డి ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని తన భార్య గంగాదేవికి చెప్పుకొని తీవ్రంగా బాధపడ్డారని తెలిపారు, ఈ అవమానాన్ని జీర్ణించుకోలేక మనస్థాపానికి గురై గురువారం రాత్రి తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు, కాగా మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కడప రిమ్స్కుకు తరలించడం జరిగిందన్నారు, మృతునికి ఒక కుమార్తె కుమారుడు ఉన్నారని పోలీసులు తెలిపారు.

About Author