PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పిడుగు పాటుకు వ్యక్తి బలి..

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో పిడుగు పాటుకు వ్యక్తి మృతి చెందిన సంఘటన పట్టణంలో చోటుచేసుకుంది . ఆదివారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పగిడాల రోడ్డు బైరెడ్డి నగర్ కు చెందిన శాలుమియ్యా(52) సాయంత్రం బహిర్భూమికి వెళ్లాడు.బహిర్భూమికి వెళ్లిన పక్కనే వైన్ షాపు పక్కనే పిడుగు పడి పెద్ద శబ్ధం వచ్చింది.పిడుగు దెబ్బకు ఆయన విగతజీవిగా పడ్డాడు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించారు. మృతుని భార్య ఆలింబీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.ఈయనకు ఒక కుమారుడు కూతురు ఉన్నారు.ఈయన కడ్డీల షాపులో రోజు వారి కూలీగా పనిచేసే వాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

About Author