PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సామూహిక వరలక్ష్మి వ్రతాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​ శ్రీశైలం: శ్రీశైలంలో మహా క్షేత్రంలో శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా వర లక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శ్రీశైల మహా క్షేత్రంలో కూడా వర లక్ష్మి వ్రతాలు ఘనంగా ఆలయ అర్చకులు నిర్వహించారు. దేవస్థానం చంద్రవతి కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరిగింది. ఈవో పెద్దిరాజు దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వ్రత కార్యక్రమంలో…సుమారు 800 మందికిపైగా మత్తైదువులు పాల్గొన్నారు. ఆలయ అర్చక వేద పండితులు తొలుత గణపతి పూజ, స్వామి అమ్మవార్లను ఆశీంప చేసి వరలక్ష్మీ వ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మవారి అవాహన కళశస్థాపనతో షోడశోపచార క్రతువులను జరిపించారు. వ్రతంలో పాల్గొన్న వారందరికీ స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించారు. అనంతరం అమ్మవారి రవిక, చీర గాజులు శేషవస్త్రంగా తులసి మొక్క అందించి తీర్థప్రసాదాలు అందించారు. 

About Author