PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏలూరులో జనసేన పార్టీలోకి భారీ చేరికలు..

1 min read

సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన రెడ్డి అప్పలనాయుడు

వైసీపీ అరాచకాలు తట్టుకోలేక జనసేనలోకి చేరికలు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు నియోజకవర్గం లోని స్థానిక 42 వ డివిజన్ పరిధిలోని కొత్తపేట ఏరియా నుండి డివిజన్ ఇంచార్జీ అగ్గాల శ్రీనివాస్  ఆధ్వర్యంలో వైఎస్సార్ పార్టీకి చెందిన సుమారు 50 మంది కార్యకర్తలు ఈరోజు జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. పవర్ పేటలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ  రెడ్డి అప్పల నాయుడు నూతనంగా జాయిన్ అయిన వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.జాయిన్ అయిన వారిలో ఘంటా రాజు, సరస పల్లి సత్యనారాయణ, ఘంటా హేమంత్, శ్రీనివాసు, ఘంటా దుర్గా పవన్, ఊడి వెంకటేశ్వరరావు, ఊడి మాణిక్యం, ఘంటా సత్యవతి, పాలూరి భవాని, బండారు దుర్గ, పి. రాంబాబు, సింహాచలం, సూరిబాబు, బి. సత్యవతి, నగిరెడ్డి సత్తిబాబు, ఘంటా జితేంద్ర, ఘంటా నితీష్, ఎస్.పోతురాజు, పూర్ణ, చైతన్య తదితరులు ఉన్నారు.ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ వైసీపీ చేస్తున్న అరాచకాలు, అన్యాయాలు,అక్రమాలు, దౌర్జన్యాలు తట్టుకోలేక వైసీపీ నుండి కార్యకర్తలు భారీగా జనసేనలోకి చేరుతున్నారని అన్నారు. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, జనసేన పార్టీ సిద్ధాంతాలు, నచ్చి పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడవాలని యువత ముందుకు వస్తున్నారని, చేరిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు.. భవిష్యత్తులో మీకు ఏ విధమైన సమస్యలు వచ్చినా జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని, చేరిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కార్యదర్శి ఎట్రించి ధర్మేంద్ర, మీడియా ఇంచార్జీ జనసేన రవి, నాయకులు రెడ్డి గౌరీ శంకర్, బోండా రాము నాయుడు,ముప్పన దేవీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

About Author