PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

27 న మిడుతూర్..28 న నందికొట్కూర్ లో సమావేశాలు

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిషత్ కార్యాలయంలో ఈనెల 27వ తేదీన అదేవిధంగా 28వ తేదీన నందికొట్కూరు పట్టణ మున్సిపాలిటీ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.27వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటలకు మిడుతూరు మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో జిఎన్ఎస్ రెడ్డి తెలిపారు.ఈ సర్వసభ్య సమావేశానికి వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ప్రజా ప్రతినిధులు హాజరుకావాలని అంతే కాకుండా వివిధ మండల శాఖల అధికారులు తమ పూర్తి నివేదికలతో హాజరుకావాలని అన్నారు.28 వ తేదీ బుధవారం ఉదయం నందికొట్కూరు పట్టణ మున్సిపాలిటీ కార్యాలయంలో సాధారణ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు పట్టణ మున్సిపాలిటీ కమిషనర్ సుధాకర్ రెడ్డి తెలిపారు.ఈ కౌన్సిల్ సమావేశానికి పట్టణంలో ఉన్న కౌన్సిలర్లు మరియు వివిధ శాఖల అధికారులు హాజరు కావాలని మున్సిపాలిటీ కమిషనర్ కోరారు.

About Author