PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలు జిల్లా ఎస్పీని కలిసిన చింతా సురేష్ బాబు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు జిల్లా నూతన సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ జి బిందు మాధవ్ ని కర్నూలు ఎస్పీ  కార్యాలయంలో మంగళవారం జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చింతా సురేష్ బాబు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ జిల్లా శాంతి భద్రతల విషయంలో జనసేన పార్టీ తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పిబివి సుబ్బయ్య, మంజునాథ్, బజారి, షబ్బీర్, సుమలత తదితరులు పాల్గొన్నారు.

About Author