PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దూదేకుల సంక్షేమానికి కృషి చేస్తా – మంత్రి టీజీ భరత్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఎన్నికల్లో తన గెలుపుకు కృషి చేసిన కర్నూలు జిల్లా దూదేకుల సంఘంకు అన్ని విధాలా అండగా ఉంటానని    రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖామాత్యులు టీజీ భరత్ అన్నారు. రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం అనంతరం కర్నూలుకు విచ్చేసిన ఆయనను జిల్లా దూదేకుల సంక్షేమ సంఘం నేతలు కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ తన గెలుపుకు కృషి చేసిన దూదేకుల కులస్థుల సమస్యల పరిష్కారానికి తన వంతు ప్రయత్నం చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు , రిటైర్డ్ డియస్పీ మహబూబ్ బాషా, వర్కింగ్ ప్రసిడెంట్ మస్తాన్ వలి, జిల్లా కార్యదర్శి సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author