PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లా పరిషత్ సమావేశాలకు హాజరైన ఎమ్మెల్యే విరుపాక్షి 

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆలూరు:  ఈ రోజు కర్నూలు జిల్లా పరిషత్ లో  సమావేశాలకు హాజరైన ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి వివిధ ప్రజా సమస్యలపై గళం విప్పారు ఆలూరు నియోజకవర్గం లో రోడ్లు నీళ్లు సమస్య తీవ్రంగా ఉండడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సత్వర చర్యల కోసం కలెక్టర్ కి జిల్లా పరిషత్ సమావేశంలో తెలపడం  జరిగింది .ముఖ్యంగా ఆస్పరి మండలంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉండడం వల్ల ప్రజల అవస్థలు పడుతున్నారు వెంటనే తాగునీటి సమస్యను పరిష్కరించండి అని తెలపడం జరిగింది అదేవిధంగా పాత ప్రాజెక్టులు పరుగులు పెట్టించాలని వాటిలో చిప్పగిరి మండలంనాగరాడోనా రిజర్వాయర్  వేదవతి ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేసి అదేవిధంగా హంద్రీనీవా కెనాల్ కు తుమ్ ఏర్పాటుచేసి ఏబిసి కెనాల్ కు సకాలంలో నే నీళ్లు  అందించాలని  వర్షాకాలం మొదలయ్యే లోపు నియోజకవర్గం లో ఉండే అన్ని రోడ్లకు మరమ్మతులు చేపట్టట్టి గుంతలు పూడ్చాలని తెలపడం జరిగింది అన్ని విన్న మంత్రి  కలెక్టర్ సత్వర సమస్యలకు పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

About Author