PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మీ ఆడబిడ్డని ఆదరించండి అభివృద్ధి చేసి చూపిస్తా ..

1 min read

బిసి మహిళ అయిన నాకు అవకాశం వచ్చింది. ఎస్సీలు, ఎస్టీలు ,బీసీలు, మైనార్టీలు, మీరందరూ ఒకే తాటిపై నిలబడి నన్ను ఎమ్మెల్యే గెలిపించాలని అభ్యర్థిస్తున్న.

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు పట్టణంలో శివనగర్ బోర్డు దగ్గర 4,5,6,7 వార్డ్ లు, ఎంబి చర్చి దగ్గర 7,8 వార్డులు, కుర్ని కళ్యాణ మండపం ఎదురుగా,18,19,20,21, వార్డుల లో  ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సభలలో పాల్గొన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక . ఈ సమావేశంలో రాష్ట్ర వీరశైవ లింగయ్య కార్పొరేషన్ చైర్మన్ వై రుద్ర గౌడ్, ఎమ్మిగనూరు మండల అధ్యక్షుడు బిఆర్ బస్సు రెడ్డి, గమాట్లాడుతూ మన బిసి మహిళ అయిన శ్రీమతి బుట్టా రేణుకని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు అయిన మీరు అందరూ ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక  మాట్లాడుతూ జగనన్న బీసీ మహిళ అయిన నాకు అవకాశం ఇచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లు  అయిన మీరందరూ నన్ను ఆదరించి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపిస్తారని, అలాగే ఎంపీ అభ్యర్థి అయిన బి వై రామయ్య కి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నాకు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి వేయించాలని అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో బుట్టా సాహితీ , మున్సిపల్ చైర్మన్ ,కౌన్సిలర్లు, వార్డ్ ఇన్చార్జిలు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author