PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంత్రి టీజీ భరత్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ ను కర్నూలు పట్టణంలోని మౌర్యన్ హోటల్ ఆయన కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రిగా ప్రమాణస్వీకారం మరియు అమరావతిలో పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మంత్రి భరత్ కర్నూలుకు వచ్చారు.భరత్ కు మంత్రి పదవి వచ్చిన సందర్భంగా ఎమ్మెల్యే కలసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.నందికొట్కూరు నియోజకవర్గ సమస్యల గురించి మంత్రికి వినతి పత్రాన్ని అందజేసి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే మంత్రిని త్వరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు కా తా రమేష్ రెడ్డి,మాజీ ఎంపీపీ వీరం ప్రసాద్ రెడ్డి,పలుచాని మహేశ్వర రెడ్డి,బ్రహ్మానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author