PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైతులకు విత్తనాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని మండల వ్యవసాయ శాఖ కార్యాలయం దగ్గర రైతులకు విత్తనాల పంపిణీ కార్యక్రమానికి నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య,నంద్యాల పార్లమెంటు టిడిపి ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై రైతులకు విత్తనాల ప్యాకెట్లను వారు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రైతుల పక్షపాతి ప్రభుత్వం అని గతంలో టిడిపి ప్రభుత్వ హయాంలోనే రైతుల అభివృద్ధి చెందాలని తర్వాత వచ్చిన ప్రభుత్వం రైతులను విస్మరించిందని గ్రామాల్లో ప్రజలను కార్యాలయాల చుట్టూ అదే పనిగా తిప్పుకోవద్దని అన్నారు.గ్రామాలను అభివృద్ధిలో సస్యశ్యామలం చేస్తామని నియోజకవర్గాన్ని ప్రశాంత వాతావరణంలో ఉంచుతామని రైతులందరూ సుఖ సంతోషాలతో బాగుండాలని ఏ నాయకుడు చేయని అభివృద్ధి గతంలో మన నియోజకవర్గంలో జరిగిందని అన్నారు.మీకు ఏమైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకువస్తే వాటిని పరిశీలిస్తామన్నారు పరిష్కరిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి,టిడిపి మండల కన్వీనర్ కాత రమేష్ రెడ్డి,ఏడిఏ విజయ శేఖర్,ఏఓ పీరు నాయక్,గుండం రమణారెడ్డి,వంగాల శివరామిరెడ్డి,గ్రామ సర్పంచ్ వి జయ లక్ష్మమ్మ,కాతా విష్ణువర్ధన్ రెడ్డి,సంపంగి రవీంద్రబాబు, నాగేంద్ర మరియు వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

About Author