PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పింఛన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే..మాండ్ర

1 min read

పల్లెవెలుగు వెబ్  మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల ను నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య మరియు నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి సోమవారం పంపిణీ చేశారు.ఎన్నికల ముందు టిడిపి అధినేత చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం వృద్ధులు వితంతువులు పింఛన్లు 3వేల నుంచి 4 వేల వరకు, దివ్యాంగులు 3వేల నుంచి 6 వేలకు మరియు తదితర పింఛన్లు పెంచుతానని మేనిఫెస్టోలో ప్రజలకు హామీ ఇచ్చారు.ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రభుత్వం నెల రోజుల్లోనే పింఛన్లను పెంచి సోమవారం రోజున ఉదయం 6 గంటల నుంచే గ్రామాల్లో ప్రతి వాడలోనూ పెరిగిన పింఛన్లను అధికారుల ఇండ్లకు వెళ్లి పంపిణీ చేస్తూ ఉండడంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. పింఛన్లు పెంచడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.మిడుతూరులో ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే మరియు శివానందరెడ్డి,టిడిపి మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి అవ్వ తాతలకు దివ్యాంగులకు పింఛన్లను పంపిణీ చేశారు.ముఖ్యమంత్రి ఇచ్చిన మాట మేరకు పింఛన్లు పెంచారని మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి పథకాన్ని త్వరలోనే ముఖ్యమంత్రి మీ ముందుకు తీసుకు వస్తారని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గంగావతి,గ్రామ సర్పంచ్ జయ లక్ష్మమ్మ,ఆర్ఐ భాష టిడిపి సీనియర్ నాయకులు కాతా రామచంద్రారెడ్డి,కాతా విష్ణువర్ధన్ రెడ్డి,ఐటిడిపి మండల కన్వీనర్ ఇంతియాజ్, యువ నాయకులు ప్రమోద్ రెడ్డి,లక్ష్మీనారాయణ,చాంద్ బాష రవి పాల్గొన్నారు.

About Author