PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పంచాయితీలకు ట్రాక్టర్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని పలు పంచాయితీలకు ఎమ్మెల్యే గిత్త జయసూర్య ట్రాక్టర్లను బుధవారం పంపిణీ చేశారు. నందికొట్కూరు మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మండలంలోని అల్లూరు,వడ్డెమాను,దామగట్ల గ్రామ పంచాయితీలకు ట్రాక్టర్లను ఆయా గ్రామ సర్పంచులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు.గ్రామాల్లో ఉండే చెత్తను తొలగించేందుకు మరియు గ్రామ పంచాయతీలకు పనుల నిమిత్తం ట్రాక్టర్లు ఉపయోగపడనున్నాయి.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నరేష్ కృష్ణ,ఈఓఆర్డి సంజన్న,సర్పంచులు నాగలక్ష్మయ్య, రామచంద్రుడు,సుశీలమ్మ నాయకులు పలుచాని మహేశ్వర్ రెడ్డి,పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

About Author