PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్రంథాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల : గడివేముల మండల కేంద్రంలో 13 లక్షల పైచిలుకు నిధులతో నిర్మించిన నూతన గ్రంథాలయాన్ని గురువారం నాడు ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన భాండగారాలని ప్రతి ఒక్కరు జ్ఞానాన్ని పెంచుకోవాలని సమాజంలో జరిగే ప్రతి విషయాన్ని పత్రికల ద్వారా పుస్తకాల ద్వారా తెలుసుకోవచ్చన్నారు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమైన పుస్తకాలు అందుబాటులో ఉంటాయని విజ్ఞానమంత గ్రంథాలయంలో అందుబాటులో ఉంటాయని  ప్రభుత్వం అన్ని వసతులతో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు అనంతరం ఎమ్మెల్యేను సన్మానించి జ్ఞాపికను అందజేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు దేశం సత్యనారాయణ రెడ్డి . మాజీ ఎంపీపీ వంగాల శ్రీనివాసరెడ్డి. గ్రంథాలయ అధికారి వెంకటేశ్వర్ రెడ్డి. తహసిల్దార్ విద్యాసాగర్ , మరియు సంభందిత ప్రభుత్వ అధికారులు మండల ఉమ్మడి కూటమి పార్టీ టీడీపీ, జనసేన,బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *