PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్ర మంత్రులను కలిసిన ఎమ్మెల్యే జయసూర్య

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ని మరియు రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ లను నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రులుగా అయిన సందర్భంగా ఆయనకు పూల బోకే అందజేస్తూ ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈనెల 12న అమరావతిలో వారు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సారిగా మంత్రి బీసీ బనగానపల్లెకు వచ్చారు.రాత్రి 8 గంటలకు నంద్యాల జిల్లా బనగానపల్లిలో మంత్రి స్వగృహంలో ఎమ్మెల్యే తో పాటు నియోజకవర్గ నేతలు మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.తర్వాత నంద్యాల లో న్యాయ, మైనారిటీ శాఖ మంత్రి స్వగృహంలో ఎన్ఎండీ ఫరూక్ ను కలసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి,మిడుతూరు టిడిపి మండల కన్వీనర్ కాత రమేష్ రెడ్డి,ఏఎంసీ మాజీ చైర్మన్ గుండం రమణారెడ్డి, పగిడాల మండల కన్వీనర్ ప లుచాని మహేశ్వరరెడ్డి,మాజీ ఎంపీపీ వీరం ప్రసాద్ రెడ్డి, మద్దిలేటి,మిడుతూరు ఐటిడీపీ మండల కన్వీనర్ ఇంతియాజ్ మంత్రని కలిసిన వారిలో ఉన్నారు.

About Author