PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నీటి సమస్యను తీర్చిన ఎమ్మెల్యే జయసూర్య

1 min read

హర్షం వ్యక్తం చేస్తున్న కాలనీవాసులు..

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని ఏబీఎం పాలెంలో ఇందిరా నగర్ లో గత ఆరు నెలల నుండి త్రాగునీటి ట్యాంకు కు నీళ్లు రావడం లేదు నీటి సమస్య తీవ్రంగా ఉండడంతో ఈ ట్యాంకు పక్కనే అంగన్వాడీ కేంద్రం మరియు కాలనీవాసులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండగా నూతన ప్రభుత్వం వచ్చాక నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య కు కాలనీ టిడిపి నాయకులు నిమ్మకాయల మోహన్,22 వ వార్డు ఇన్చార్జి కళాకర్,మహేష్ అడివప్ప,నవీన్,బొల్లెద్దుల భాస్కర్,ప్రేమ్,బంగారు సూరి, బొల్లెద్దుల జమ్ములయ్య  ఎమ్మెల్యే దృష్టికి వారం రోజుల క్రితం తీసుకువెళ్లారు.వెంటనే ఎమ్మెల్యే డిఈ కి ఫోన్ చేసి కాలనీలో ఉన్న నీటి సమస్యను తీర్చాలని ఎమ్మెల్యే చెప్పడంతో ఆదివారం రోజున మోటర్ రిపేర్ చేయించి నూతన పైపులను అధికారులు వేయటం వల్ల త్రాగునీటి ట్యాంకు కు నీళ్లు రావడం పట్ల ఆ కాలనీ వాసులు ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలుపుతూ హ ర్షం వ్యక్తం చేస్తున్నారు.

About Author