PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కార్యకర్తను పరామర్శించిన ఎమ్మెల్యే జయసూర్య..

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని ఉప్పలదడియ గ్రామానికి చెందిన టిడిపి నాయకులు యనబోతుల పౌ ల్లయ్య కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు.ఈ విషయం తెలుసుకున్న నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఆదివారం మధ్యాహ్నం ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు.గత ఎనిమిది నెలల క్రితం పౌలయ్య కు కాలు చేయి పక్చవాతం రావడంతో ఆయన కర్నూల్ లో అమీలియో ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని ఇంటికి వచ్చారు.ఎమ్మెల్యే ఇంటికి వచ్చి ఆరోగ్య స్థితి వివరాల గురించి ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు.మీ కుటుంబానికి ప్రభుత్వపరంగా నా వంతుగా సహకారం అందిస్తానని అంతేకాకుండా మీరు ఆస్పత్రిలో సొంత ఖర్చులు చేసి ఉంటే వాటి బిల్లులు తీసుకొని నా దగ్గరకు వస్తే  సీఎం రిలీఫ్ ఫండ్ కింద వచ్చే విధంగా చేస్తానని  ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి, కమతం రాజశేఖర్ రెడ్డి, నాగలూటి సంపంగి రవీంద్రబాబు, ఆనందరావు,పక్కిరయ్య, రత్నపాల్ పాల్గొన్నారు.

About Author