PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నూతన డీఐజీ ని కలిసిన ఎమ్మెల్యే..మాండ్ర

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: కర్నూలు రేంజ్ నూతన డీఐజీ కోయ ప్రవీణ్ ను నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి డీఐజీ ని మర్యాద పూర్వకంగా కలిశారు.  శుక్రవారం నూతన డిఐజి గా బాధ్యతలు చేపట్టిన కోయ ప్రవీణ్..శనివారం సాయంత్రం కర్నూలు డిఐజి కార్యాలయంలో వారు కలిశారు.నందికొట్కూరు నియోజకవర్గంలోని పలు సమస్యల గురించి డీఐజీ దృష్టికి ఎమ్మెల్యే మరియు శివానందరెడ్డి తీసుకువెళ్లారు. వాటిపై డిఐజీ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.తర్వాత డీఐజీ ని పుష్పగుచ్చంతో శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు  మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, పలుచాని మహేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీపీ వీరం ప్రసాద్ రెడ్డి,హరినాథ్ రెడ్డి పాల్గొన్నారు.

About Author