PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్ర డీజీపీ ని కలిసిన ఎమ్మెల్యేలు..మాండ్ర

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రాష్ట్ర డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు ను నందికొట్కూరు,పాణ్యం,శ్రీశైలం ఎమ్మెల్యేలు గిత్త జయసూర్య, గౌరు చరితారెడ్డి,బుడ్డా రాజశేఖర్ రెడ్డి మరియు నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి, నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ రాష్ట్ర డిజిపీ ని గురువారం సాయంత్రం అమరావతిలో డిజిపి కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన డిజిపి కి పూల బోకేను వారు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.అదేవిధంగా మంత్రి నిమ్మల రామానాయుడు ను కలిశారు. తర్వాత నందికొట్కూరు నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి రాష్ట్ర డిజిపి తో మరియు మంత్రితో మాట్లాడినట్లు ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కాతా రమేష్ రెడ్డి,పలుచాని మహేశ్వర్ రెడ్డి,వీరం ప్రసాద్ రెడ్డి,గిరీశ్వర్ రెడ్డి,ఐటిడిపి మండల కన్వీనర్ ఇంతియాజ్, తదితరులు పాల్గొన్నారు.

About Author