PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రశాంతంగా ముగిసిన మొహరం పండుగ

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: ప్యాపిలీ మండలంలోని పట్టణ, గ్రామాల్లో మొహరం పండుగ  బుధవారం ప్రశాంతంగా ముగిసింది. ఈసందర్భంగా పట్టణంలో ని  పీర్ల సావిడిలో పీర్ల కు ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులు తమ కోరికల మేరకు  చెక్కర, వెండి ఆభరణాలు పూలమాలతో మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం పట్టణంలో ని క్రింది గేరి నుంచి ఖాజా నావాజ్ పెద్ద బందనావాజ్ స్వాములు, తదితర పీర్ల చావిడి నుంచి పీర్లను మైయిన్ బజార్ మిదుగ బస్టాండ్ వరకు పీర్లను గ్రామంలో తీరుగుతు ఎటికి సాగిపోయాయి. మొహరం పండుగ సందర్భంగా ప్యాపిలీ పోలీసులు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.

About Author