PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కేంద్ర మంత్రిని కలిసిన ఎం.పి బస్తిపాటి నాగరాజు

1 min read

కర్నూలు విమానాశ్రయం అభివృద్ధి కి సహకరించాలని కోరిన ఎం.పి

కర్నూలు, పల్లెవెలుగు:కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ని కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు మర్యాద పూర్వకంగా కలిసారు.. ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొంటున్న ఎం.పి మంగళవారం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కార్యాలయంలో ఆయనను కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువతో సత్కరించారు..ఈ సందర్భంగా కర్నూలు విమానాశ్రయం అభివృద్ధికి సహకరించాలని అలాగే విజయవాడ, తిరుపతి నగరాలకు కొత్త సర్వీసులు అందించాలని కోరినట్లు తెలిపిన ఎం.పి నాగరాజు..దీని పై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు.

About Author