PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నూతన ఎస్పీ బిందు మాధవ్ ను కలిసిన ఎం.పి బస్తిపాటి నాగరాజు

1 min read

శాంతి భద్రతల పై ఎస్పీ తో చర్చించిన ఎం.పి

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు జిల్లా ఎస్పీ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన బిందు మాధవ్ ను ఎం.పి బస్తిపాటి నాగరాజు మర్యాద పూర్వకంగా కలిశారు.. జిల్లా పోలీసు కార్యాలయంలో కొత్త ఎస్పీకి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.. ఈ సందర్భంగా జిల్లా పోలీసు బాస్ తో భేటి అయిన ఎం.పి నాగరాజు , జిల్లాలో శాంతిభద్రతల పై చర్చించారు.. అసాంఘిక కార్యకలాపాల పై కఠిన చర్యలు చేపట్టి నేర రహిత కర్నూలుగా తీర్చిదిద్దే విదంగా కృషి చేయాలని ఎస్పీ బిందు మాధవ్ ను ఎం.పి కోరారు.

About Author