PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కలెక్టర్.. జాయింట్ కలెక్టర్ ను కలిసిన ఎంపీ శబరి

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నూతనంగా ఎంపీగా ఎన్నికైన నంద్యాల పార్లమెంట్ ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి శనివారం నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు ను మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి లను ఎంపీ శబరి మర్యాద పూర్వకంగా కలిశారు. శనివారం నంద్యాల జిల్లా కేంద్రంలోని వారి కార్యాలయాల్లో ఎంపీగా గెలుపొందిన తర్వాత మొదటి సారిగా కలెక్టర్ మరియు జేసీలను కలసి పుష్పగుచ్చాలు అందజేశారు.ఈ సందర్భంగా నంద్యాల పార్లమెంట్ లోని నందికొట్కూరు,శ్రీశైలం, నంద్యాల,ఆళ్లగడ్డ,బనగానపల్లి,డోన్ ఏడు నియోజక వర్గాల అభివృద్ధికి సహకరించాలన్నారు.జిల్లాలో ఉన్న సమస్యల గురించి కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ దృష్టికి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి తీసుకువెళ్లారు.సమస్యల పట్ల వారు సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు.

About Author