PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తాసిల్దార్ సతీష్ ను కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు

1 min read

దళితుల సమస్యలపై దృష్టి సారించాలని వినతి

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : హొళగుంద నూతన తహసిల్దార్ గా బాధ్యతలు చేపట్టిన తాసిల్దార్ సతీష్ ను ఎంఆర్పిఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా  తాసిల్దార్ సతీష్ ను శాలువా పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ దళిత నాయకులు తాసిల్దార్ తో మాట్లాడుతూ మండలంలో గతంలో ఎన్నో భూ అక్రమాలు జరిగాయని  దళితుల యొక్క భూములు  వారు సాగు చేసుకుంటున్నప్పటికీ ఆన్లైన్లో ఇతరుల పేర్లు ఉన్నాయని , మరి కొన్ని భూములు ఆన్లైన్లో కనిపించడం లేదని, పడవల పాస్ పుస్తకాలు లేవని, దళితుల భూములపై ఇతరుల వివాదాలు ఉన్నాయని పలు వివాదాలు తాసిల్దార్ కార్యాలయంలో పెండింగ్లో ఉన్నాయని  వాటన్నింటినీ పరిశీలించి పరిష్కరించాలని కోరారు. గ్రామాలలో సైతం అనేకమైన సమస్యలు ఉన్నాయని పేర్కొనడంతో న్యాయమైన వివాదారహితమైన వాటిని   పేదలకు న్యాయం చేస్తామని  జటిలమైన  వాటిని ఉన్నతాధికారులకు నివేదిస్తామని తాసిల్దార్ దళిత నాయకులకు    తెలిపారు  ఈ కార్యక్రమంలో పత్తికొండ ఎమ్మార్పీఎస్ వైస్ ప్రెసిడెంట్ పంచగుండగ వెంకటేష్ మాదిగ, సీనియర్ నాయకులు సినిమా మంగన్న, రామచంద్ర ముత్తయ్య రుతి తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *